గృహస్థులు యొక్క విధి విధానాలు

గృహస్థులు యొక్క  విధి విధానాలు

1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు.హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు పెట్టకూడదు.

2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. ఆయనే మనకు ప్రత్యక్షంగా  కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ పెట్ట కూడదు.  లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చును.

4.చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చును.

5. లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే చాలా  మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.

6. కాళికా మరియు  ప్రత్యంగిరా దేవి ఫోటోలు కూడా పెట్టకూడదు.

7. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే చాలా   మంచిది.  పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది.  విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన మరియు  వారంలో ఒక్కసారి అయినా అభిషేకం చేస్తూ  ఉండాలి. పూజ లేకుండా ఉంచ కూడదు.

8. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు.  నాట్యం నేర్పే ప్రదేశంలో మాత్రమే   నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ  ఉండవచ్చును .

9.దిష్టి కోసంఅని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. అలా పెట్టితే  ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు. వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని మరియు  కాళీ పాదం ఫోటో  కానీ పెట్టడం చాలా  మంచిది.

Read More  తెలుగులో లింగాష్టకం

10. నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టడం  మంచిది .

11. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో తొండం ఎడమ వైపు ఉండాలి.  విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహంకి తొండం కుడి వైపు ఉండాలి.వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉంటే  మంచిది .

12. ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు.  లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది.

13. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన  నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి.

14.పూజ గదిలో  ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా కూడా  పెట్టాలి.

వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రుద్దీ నామాలు పెడతారు, మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం.  ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు.

15. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు రాకుండా ఉండాలి  అంటే ఆముదంతో దీపారాధన చేయాలి.నిత్యం అవునేతి దీపం  పెడితే లక్ష్మీ కటాక్షం వస్తుంది .  శత్రు పీడలు  మరియు  గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు  తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.

Read More  కదంబ వృక్ష మహిమ,Kadamba Tree Mahima

16. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.

17. బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ  ఏది అక్కడ పెట్ట కూడదు. గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ  నమస్కారాలు చేయకూడదు.

18. నవగ్రహాలు తాకి మొక్క రాదు.

19. షష్ఠి, అష్టమి మరియు  త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రి పూట తల చిక్కు తీయకూడదు.  పెరుగు చేతితో చిలక రాదు.

20. నీరు,పాలు మరియు  పెరుగు, నైయి కి అంటు ఉండదు.అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చును .

21. లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు చాలా  ఉన్నాయి.  లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి.

జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి . జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం  ఉన్నాయి .

పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం  కూడా లభిస్తుంది.

పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు, మరియు పంచి పెడితే ఇంకా మంచిది.

22. రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు.  ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. అలాగే తిట్టుకుంటూ వంట చేయరాదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు.

23.ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు, అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు మరియు ఎప్పుడూ తింటూనే ఉండే వారు, అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా పెద్ద పాపాత్ములు..

Read More  సోమవారం శివునికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు,The Results Of Worshiping Lord Shiva On Monday

24.పచ్చి పాలు నైవేద్యం పెట్టరాదు. కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..

25.ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో కూడదు, నిలువుగా మాత్రమే  ఉండాలి.

జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు, మధ్య వేలు తోనే చేయాలి.

26. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోరాదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు.

27. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ రాదు.

28.దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు మరియు పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు.

29. ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు.మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో నే లేవకూడదు, రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి.అలా ఒక్కసారి లేస్తే ఆదిత్యం ఇచ్చిన ఫలితం దక్కదు.

30.ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవం యొక్క  ఫోటో పెట్టాలి.  అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.

31.అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడక పోవచ్చును.   అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన wallmat గోడకు డెకరేషన్ గా కూడా  పెట్టాలి.

32. ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. ఆలా వేస్తే నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి కూడా  శుభ్రం  అవుతుంది.

Sharing Is Caring:

Leave a Comment