ధనుర్మాసం యొక్క విశిష్టత గోదాదేవి జీవిత చరిత్ర ఏడునూతుల

ధనుర్మాసం యొక్క విశిష్టత గోదాదేవి జీవిత చరిత్ర ఏడునూతుల

 

దక్షిణ ముఖ ద్వారం గల ఏడునూతుల వేణు గోపాల స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సం  ధనుర్మాసము లో  ఆండాళ్ (గోదాదేవి ) కి  నెల రోజుల వ్రతం చేయబడును.  పెళ్లి కానీ యువతులు ఈ వ్రతం చేస్తారు . దేవాలయంలో ధనుర్మాసములో  ఉదయం తెల్లవారకముందే   అమ్మవారైనా గోదాదేవి ని తులసి మాల తో అలంకరించి ధనుర్మాసము మొదటి రోజు నుండి రోజుకు ఒక  తిరుప్పావు అనే రచనలను పాడుతారు అలాగే ఈ ధనుర్మాసము లో నైవేద్యంగా మొదటి పదిహేను రోజుల పాటు నైవేద్యంగా పులగం లేదా చెక్కర పొంగలి  (కట్టే పొంగలి ) ని తరువాత పదిహేను రోజుల పాటు దద్ధోజనం సమర్పిస్తారు . అట్టి  నైవేద్యమును  భక్తులకు బాల భోగం గా పంచుతారు.

ఏడునూతుల దేవాలయంలో ధనుర్మాసం మొత్తం వైష్ణవ సాంప్రదాయంలో  ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే గోదాదేవి రాసిన  “తిరుప్పావై” ని ఈ నెల  రోజులు పాడుతారు .ధనుర్మాసము చివరి నాడు దేవాలయంలో ఆండాళ్ (గోదాదేవి ) కి శ్రీ రంగ నాధునికి అంగరంగ  వైభవంగా కళ్యాణం చేస్తారు .

రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడం 
? తెలంగాణ రాష్ట్రం లో జనగాం జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల  లో వేణు గోపాల స్వామి దేవాలయం  ఉన్నది 
 
?  జనగాం జిల్లా పాలకుర్తి లోని సోమేశ్వర లక్ష్మి నర్శింహా స్వామి దేవాలయం నుండి 12 కిలోమీటర్ల దూరం లో ఏడునూతుల  ఉన్నది .
 
?  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుండి 25 కిలోమీటర్ల దూరం లో ఏడునూతుల  ఉన్నది .
 
?  మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం నుండి 28 కిలోమీటర్ల దూరం లో ఏడునూతుల  ఉన్నది .
 
 
వేణు గోపాల స్వామి దేవాలయం ఏడునూతుల  రూటు మ్యాప్

ఆండాళ్ (గోదాదేవి ) పూర్తి చరిత్ర 

గోదాదేవి అనగా ఎవరు.?

గోదాదేవి పేర్లు  – కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, ఆముక్త మాల్యద

గోదాదేవి జన్మస్థలం – శ్రీరంగం

గోదాదేవి జన్మ నక్షత్రము – నల సంవత్సరం, కర్కాట మాసము, పుబ్బా నక్షత్రము, ఆషాఢ శుద్ధ చతుర్దశి, కాలము క్రీ.శ.776

గోదాదేవి దైవాంశ – లక్ష్మి

గోదాదేవి రచనలు – తిరుప్పావు, నాచ్చియార్ తిరుమొళి

ధనుర్మాసం యొక్క విశిష్టత గోదా దేవి జీవిత చరిత్ర ఏడునూతుల

గోదా చరితం

Read More  కర్ణాటకలోని పణంబూర్ బీచ్ యొక్క పూర్తి వివరాలు,Complete details of Panambur Beach in Karnataka

తమిళనాడు రాష్ట్రం లోని శ్రీవిల్లిపుత్తూరు గ్రామం లోని తులసి వనంలో కలియుగ ఆది లో అనగా 93 సంవత్సరం లో గోదాదేవి శ్రీవిష్ణుచిత్తుల వారికీ చిన్న పాపగా ఒక తులసి చెట్టు వద్ద  కనిపించింది .  శ్రీవిష్ణుచిత్తుల (పెరియాళ్వార్) భక్తుడు ఆ పాపకు గోదాదేవి అను నామకరణము చేసి ముద్దుబిడ్డగా ఆమెను ప్రేమతో పెంచి పెద్ద చేశాడు .

తమిళంలో కోదై అనగా తులసి మాల అని అర్థం. శ్రీవిష్ణుచిత్తుల వారికీ తులసి చెట్టు క్రింద కనిపించింది కనుక ఆమెను కోదా అని పిలిచేవారు.ఆమె పెరిగేకొద్దీ ఆ పేరే గోదా గా మారినది . . తండ్రి పెంపకం లో గోదా అమితమైన కృష్ణ భక్తి తో పెరిగి పెద్దయినది  .

 ప్రతి రోజు విష్ణుచిత్తులవారు తులసి మాలను తయారు చేసి ఒక బుట్టలో పెట్టి తిరిగి తన పనులను పూర్తి చేసుకొని ఆ తులసి మాలను దేవాలయానికి తీసుకొనివెళ్ళి నారాయణుకి  సమర్పించేవాడు.

గోదా ప్రతి రోజు తండ్రి గారికి తెలియకుండా ఆ మాలను తను దరించి తాను భగవంతున్ని పెళ్లి చేసుకోవడానికి  సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసిపోయేది .

ఆ  కృష్ణ భగవానుని  తన భర్తగా ఊహించుకుంటూ ఆ భగవంతుణ్ణి  పొందడం కోసం తన ఇంటిని శుభ్రం చేసి, రంగు రంగుల ముగ్గులు వేసి పూలతో వాకిలి ని అందంగా అలంకరించి  తమిళంలో పాశురాలుగా పాడి, ధనుర్మాస (శ్రీ) వ్రతాన్ని పూర్తిచేసినది .

కొంత కాలానికి విష్ణుచిత్తుల గార్కి ఆ తులసి మాలలో ఒక వెంట్రుక కనిపించింది .  గోదా ఆ తులసి మాలను వేసుకున్నదని గమనించి ఆమెను కోపగించాడు. ఇన్నిరోజులు తన చేత తప్పు జరిగిందని భావించి ఆ తులసి మాలను భగవంతునికి వేయలేదు . ఆరోజు ఆశ్చర్యంగా కళలో  స్వామి కనిపించి ఈ రోజు తులసి మాలని ఎందుకు వేయ  లేదని అడిగినాడు .. తన కు భక్తులు తాకిన తులసి మాల అంటే ఇష్టం అని చెబుతారు.

 విష్ణుచిత్తులవారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించినారు .   నీవు మమ్మల్ని రక్షించడానికి  వచ్చావమ్మ  అంటూ తనను  ఆండాళ్ అని పిలవటం మోదలు పెట్టాడు. ఆండాళ్ అనగా రక్షించడానికి  వచ్చినది అని అర్థం.

ధనుర్మాసం యొక్క విశిష్టత గోదా దేవి జీవిత చరిత్ర ఏడునూతుల

ఆ నాటి నుండి ప్రతి నిత్యం ఆండాళ్ దరించిన ఆ తులసి మాల నే స్వామికి వేసేవాడు . . గోదాదేవికి యుక్త వయస్సు  రాగానే  పెళ్ళి చేయాలనీ తండ్రి వరునికై వెతుకుచుండెను , కాని ఆమె కృష్ణున్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని  పంతంతో  తండ్రి చెప్పెను. కాని తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరం లోని  నందగోకులమనే ప్రాంతము లో ఉంటున్నాడని అది మనకు చాల దూరము, కాలము కూడా వేరు అని చెప్పినాడు .

Read More  కర్నాటకలోని సిరిమనే జలపాతం యొక్క పూర్తి వివరాలు,Complete Details Of Sirimane Falls in Karnataka

తండ్రి ఆమెకు కృష్ణుడిని కేవలం పూజించే దైవంగా చూడాలని చెప్పినాడు . తండ్రి గారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా దేవతా మూర్తుల కళ్యాణ గుణగణాలను కీర్తించెను. తరువాత గోదాదేవి శ్రీరంగం కు పోయి అక్కడ ఉన్న రంగనాయకులని వరునిగా కొలిచెను . శ్రీరంగనాథున్ని కళ్యాణమాడుటకై తాను “తిరుప్పావై” మరియు “నాచియార్ తిరుమొఱ్ఱి” అనే కీర్తనలను  పాడెను.

ఒక నాడు శ్రీ రంగనాథుల వారు విష్ణుచిత్తుల వారికి కళలో కనిపించి, నీ కుమర్తె గోదా ను తనకిచ్చి పెళ్లి చేయటానికి బాధపడవద్దని  చెప్పెను.  ఆమె మరెవరో కాదు భూదేవి అని చెప్పెను. అదే విదముగా శ్రీరంగంలోని  పెద్దలకు కూడా కళలో  కనిపించి తన కళ్యాణముకై శ్రీవిల్లిపుత్తుర్ నుండి గోదాదేవి వారిని పల్లకీలో తెమ్మని చెప్పినాడు .  అప్పటి  రాజు వల్లభ దేవుని తో పాటు పెద్దలందరూ కలిసి గోదాదేవి ని రంగనాథుని వద్దకు తెచ్చారు . ఆమె ఆ రంగనాథున్ని కళ్యాణమాడి సన్నిధిలో కలిసిపోయినది.

ధనుర్మాసం యొక్క విశిష్టత గోదా దేవి జీవిత చరిత్ర ఏడునూతుల

 

అలనాడు గోపికలందరు  అనంత శక్తిస్వరూపుడైన వేణుమాధవుణ్ణి ‘ప్రియమైన’ చెలికాడు అను దృష్టితో ఆరాధించేవారు . అప్పుడే ఆయన్ని పొందగలిగారు. అదే దృష్టితో వేణుమాధవుణ్ణి  గోదాదేవి ఆరాధించింది. ఆమె వేణుమాధవుణ్ణి ప్రియునిగా భావించినది  ,

స్వచ్ఛమైన మనస్సు తో తన హృదయాన్ని రంగనాథుడికి సమర్పించుకున్నది గోదాదేవి..  పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి కృప తప్పకుండా కలుగు తుందని చెప్పినది . ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధం లో అంటే 4000 పాశురాలలో గోదాదేవి గారు పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం కలిగినది. మార్గశిర మాసం లో ప్రతి రోజు  తిరుప్పావై లో ఉన్న మొత్తం  30 పాశురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు.

ధనుర్మాసం యొక్క విశిష్టత గోదా దేవి జీవిత చరిత్ర ఏడునూతుల

ఏడునూతుల వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సం ఇక్కడ ఉన్న ఆండాళ్ (గోదాదేవి ) కి ధనుర్మాసము లో గోదాదేవి కి  నెల రోజుల వ్రతం చేయబడును కళ్యాణం కానీ యువతులు ఈ వ్రతం చేస్తారు . ఇక్కడ ప్రతి సంవత్సరం గ్రామస్థుల సహకారం తో రుక్మిణి  సత్యభామ వేణు గోపాల స్వామికి బ్రహ్మోత్సవాలు  జరుగుతాయి  ఇక్కడ వేణు గోపాల స్వామి వారు దక్షిణ ద్వారం నుండి భక్తులకు దర్శనం ఇస్తారు ఈ దేవాలయం 1000 సంవత్సరాల పూర్వం కట్టినారు . ఇక్కడ భక్తులకు వసతి గృహాలు ఉన్నాయి . ఈ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే యాదవులు తమ ఆరాధ్య దైవమైన కృష్ణా మందిరంలో ఉట్లు కొడతారు ,
కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలో మంచి నీటి సమస్య తో కరువు కాటకాలతో ప్రజలు బాధపడుతున్నప్పడు వేణుగోపాల స్వామి వారు గ్రామం లోని ఇద్దరు అక్కాచెలెళ్లకు కలలో కనిపించి మీరు చెరువు వద్ద మంచి నీటి బావి మీరు మాత్రమే తొవ్వగలరు అని చెప్పటం తో అప్పుడు వారు పెధ్ద రాతిపలకల తో ఏడూ కొలల బావి తొవ్వి రాతి తో నిర్మిచారు.  అప్పటి నుండి గ్రామం లో నీటి సమస్య తీరడం తో  ఏడుబావుల గ్రామంగా పిలువా బడుచు  కాలక్రమేణా  ‘ ఏడునూతుల ‘ గా మారిపోయినది. ఇప్పటికి ఆబావి నీటిని గ్రామంలోని ప్రజలు తాగుచున్నారు .
Sharing Is Caring:

Leave a Comment